మినీడెయిరీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి - ఎస్సీల సంక్షేమానికి సీఎం కృషి👈 - రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉంది👈 - అన్ని కులాలకు జీవనోపాధి -మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు👈 మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతున్న రైతు సంక్షేమం కోసం సీఎం కేసిఆర్, వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారని పంచాయితీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం డివిజన్ కేంద్రంలోని కెఆర్ గార్డెన్ నందు ఎమ్మేల్యే డాక్టర్ టి.రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పోరేషన్ మినీడైరీ మంజూరి పత్రాలను లబ్దిదారులకు అందజేయు కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసిఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత సీఎందని పేర్కొన్నారు. భూముల క్రమబద్దీకరణ కోసం నూతన రెవిన్యూ చట్టం, నియంత్రిత సమగ్రనూతన వ్యవసాయ విధానం, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారని తెలిపారు. ముదిరాల జీవనోపాధికి ఉచిత చేపపిల్లలు, గొల్ల...
EXPLORE ALL AROUND THE WORLD NEWS YOU ARE VOICE IS FUTURE